టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులపై పాలకమండగలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. తిరుమల కల్యాణ కట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేట్ (గుండుకు ఇంత లెక్కన) పని చేస్తున్న క్షురకులకు ఎవ్వరూ ఊహించని విధంగా జీతం పెంచారు. వీరి బాధలు, ఇబ్బందుల గురించి ఆలోచించి.. వీరిక నెలకు రూ.20 వేల కనీస వేతనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సుమారు 250 కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని టీటీడీ తెలిపింది. కరుణాకర రెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పై పీస్ రేట్ క్షురకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ఊహించని విధంగా కరుణాకర్ రెడ్డి జీవితంలో మరచిపోలేని సహాయం చేశారని వారు కృతజ్ఞతలు తెలిపారు.
టీటీడీలో శాశ్వత ఉద్యోగులు కాని పోటు కార్మికులకు రూ.10వేల జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సుమారు 350 కుటుంబాలకు మేలు జరుగుతుంది. వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి పెద్ద జీయర్ మఠానికి ఏటా రూ.60 లక్షలు, చిన్న జీయర్ మఠానికి ఏటా రూ.40 లక్షల అదనపు ఆర్ధిక సహాయం చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన కాంట్రాక్టు కార్మికుల జీతాలు కనీసం రూ.3 వేలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 2 వేల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారు. కరుణాకర్రెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీలోని ప్రతి ఉద్యోగికి, రిటైర్డ్ ఉద్యోగికి ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత నాది అని ప్రకటించిన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన మాట నిలుపుకుంటున్నారు. గురువారం తొలి విడతగా 3518 మంది ఉద్యోగులకు మహతి ఆడిటోరియంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయబోతున్నారు. మరో వారం పది రోజుల్లో ఇంకో 1500 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వానికి రూ.80 కోట్ల రూపాయలు చెల్లించి మరో 350 ఎకరాల భూమి సేకరించి ఫిబ్రవరిలోపు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. 2006-2008 మధ్య టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర రెడ్డి పదవీ బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన నాయకత్వంలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. మళ్ళీ 16 ఏళ్ల తర్వాత భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో టీటీడీ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa