ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ హయాంలో విశాఖ వనరులను దోపిడీ చేసిన వారిలో అయ్యన్నపాత్రుడు ఒకడు కాదా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 01:05 PM

వైసీపి చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో  రూ. 2700 కోట్ల రూపాయల వ్యయంతో నర్సీపట్నం నియోజకవర్గంలో అబివృద్ధి పనులు, రూ. 500కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. శాడిస్టు అయ్యన్నపాత్రుడు సైకోలా తయారై బూతులు మాట్లాడుతున్నారని, ఆయన లాంటి చెత్తనా కొడుకులు, సన్నాసులు మాట్లాడుతుంటే సిగ్గేస్తుందని అసహనం వ్యక్తం చేసారు. టీడీపీ హయాంలో విశాఖ వనరులను దోపిడీ చేసిన వారిలో అయ్యన్నపాత్రుడు ఒకడు కాదా అన్ని ప్రశ్నించారు.  2019 ఎన్నికల్లో 600 హామీలిచ్చి 60 హామీలు కూడా అమలు చేయలేని నాయకులు చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు అని మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న కాలంలో శిలాఫలాకాలు వేయడం తప్పితే, ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని ఎద్దేవా చేసారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని,  టీడీపీ, జనసేన కూటమిలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని, ఎన్ని స్థానాలకు పోటీ చేస్తారో కూడా చెప్పాలని  సవాల్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa