ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిడ్జి పైకెక్కిన రైలు బోగి.. హే భగవాన్!

national |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 09:19 PM

వంతెన కింద విమానం ఇరుక్కున ఘటన మరువక ముందే.. బిహార్‌లో రైలు కోచ్‌ను తీసుకెళ్తోన్న ట్రక్కు ప్రమాదానికి గురయిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన భాగల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. లోహియా వంతెన వద్ద జరిగిన ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ‘రైలు బోగీని తీసుకెళ్తోన్న ట్రక్కు.. అదుపుతప్పి లోహియా వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది’ అని పేర్కొన్నారు. మాల్దా డివిజన్ డీఆర్ఎఫ్ వికాస్ చౌబే మాట్లాడుతూ.. ‘రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే కాంప్లెక్స్2లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.. ఈ క్రమంలో అక్కడ ఉన్న కోచ్‌ను రెస్టారెంట్ నిర్వాహకులు తరలిస్తున్నారు.. ఈ క్రమంలో ట్రక్కు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి.. రోడ్డుకు అడ్డంగా ఇరుక్కుపోయింది’ అని అన్నారు.


ఈ ఘటన పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించింది. దీంతో సమీపంలోని రోడ్లపై గణనీయమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అయితే స్థానిక పోలీసులు, రైల్వే అధికారుల సహకారంతో ఎట్టకేలకు ట్రాఫిక్‌ను క్లియర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శుక్రవారం తూర్పు చంపారన్‌లోని మోతిహారిలోని పిప్రకోఠి వంతెన కింద లక్నో నుంచి అసోంకి ట్రక్కులో తరలిస్తున్న ఓ పాత విమానం వంతెన కింద చిక్కుకుంది. ట్రక్కు మీద ఆ విమానాన్ని తీసుకెళ్తుండగా.. డ్రైవర్ చేసిన పొరపాటు వల్ల బ్రిడ్జి కింద చిక్కుకుపోవడం వల్ల అక్కడ ట్రాఫిక్‌‌ జాం అయ్యింది. అందులో చిక్కుకున్నవారు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. సర్వీస్ పూర్తయిన ఎయిరిండియాకు చెందిన ఓ పాత విమానం ఏ320.. ముంబయి నుంచి అసోంకు ఓ ట్రక్కుపై తరలించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మోతీహరి పట్టణంలోని పిప్రాకోటి ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న ఓవర్‌ బ్రిడ్జి దాటేందుకు ట్రక్కు ప్రయత్నించింది. ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే విమానం చిక్కుకుపోయిందని అధికారులు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa