ఈనెల 4వ తేదీన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. మరికొద్ది సేపట్లో ఇడుపుల పాయలో షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉంది. 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్లో చేరనున్నారు. ఏఐసీసీ పదవి లేదంటే ఏపీ పీసీసీ పదవి ఇస్తారా? అనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి వైపు రాహుల్ మొగ్గు చూపుతున్నారు. ఏఐసీసీ, సీడబ్ల్యుసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి మరికొన్ని గంటల్లో సస్పెన్స్కు తెరపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa