కోపంలో చేసిన పనులు ఎక్కడి వరకు దారి తీస్తాయో ఎవరూ చెప్పలేరు. గొడవల్లో మాటా మాటా పెరిగి హత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఇక అలాగే క్షణికావేశంలో ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఓ అంగన్వాడీ కార్యకర్త ముక్కును కత్తితో కోసేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అయితే వారి ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం చిన్నది కావడం గమనార్హం. చిన్న పిల్లలు చేసిన పనికి పెద్దలు గొడవ పెట్టుకుని.. చివరికి ఓ మహిళ ముక్కు కోసే వరకు వెళ్లడం సంచలనం అయింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళగావికి చెందిన అంగన్వాడీ కార్యకర్త సుగంధ మోరే స్థానికంగా తన ఇంట్లో పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఆమె పిల్లలు పక్కనే ఉన్న కల్యాణి మోరే అనే వ్యక్తి ఇంట్లో ఉన్న పెరడులో పూలు తెంపుకుని వచ్చారు. అయితే పిల్లలు పూలు తెంపడాన్ని కల్యాణి మోరే చూశాడు. దీంతో కల్యాణి మోరే ఆ పిల్లలపై ఆగ్రహించాడు. అనంతరం సుగంధ మోరేతో గొడవకు దిగాడు. తన ఇంట్లో సుగంధ మోరే పిల్లలు పువ్వులు తెంపారని వాదనకు దిగాడు. దీంతో వారి ఇద్దరి మధ్య మాటామాట పెరిగి భౌతిక దాడులకు దిగేలా చేసింది.
ఈ గొడవతో తీవ్ర కోపానికి గురైన కల్యాణి మోరే.. తన ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి సుగంధ మోరే ముక్కు కోసేశాడు. ఈ ఘటనలో బాధితురాలు సుగంధ మోరే తీవ్రంగా గాయపడింది. ముక్కు కోసేయడంతో ఆమె ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారడం ప్రారంభమైంది. ఈ ఘటనతో అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. భారీగా రక్తస్రావం అవుతున్న సుగంధ మోరేను స్థానికులు హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సుగంధ మోరేను పరీక్షించిన డాక్టర్లు ఆమె పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలిపారు. సుగంధ మోరేపై దాడి చేసిన తర్వాత కల్యాణి మోరే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు కల్యాణి మోరే కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa