ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాలు అందనివారు రాష్ట్రంలో ఉండకూడదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 05, 2024, 04:45 PM

 ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ..ఇంత బాధ్య‌త‌గా ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం ఎంతో సంతోషాన్నిస్తోంద‌ని చెప్పారు. జనవరి–జూన్‌ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్‌–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్‌ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్‌–జనవరిలో సాయం అందిస్తున్నామ‌న్నారు.  ఈ నేపథ్యంలో.. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్‌ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం వైయ‌స్ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com