ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోటీసులకు భయపడం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 05, 2024, 05:12 PM

 ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులకు భయపడేది లేదని ఏఐటీయూసీ అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు హెచ్చరించారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవ రాయల సర్కిల్‌లో అంగన్‌వాడీల సమ్మె గురువారం 24వ రోజుకు చేరిం ది. ఈ సందర్బంగా ఈ నెల 5వ తేదీన అంగన్‌వాడీలు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను అంగన్‌వాడీ ఉద్యోగులు యూ నియన్‌ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మునెప్ప, చంద్రశేఖర్‌, సాయిబాబా, సుధాకరప్ప, మహ్మద్‌ రఫీ, రేణుకమ్మ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com