దేశంలో మరోసారి కరోనా వైరస్ మరణ మృదంగం ఆడుతోంది. 24 గంటల వ్యవధిలోనే దేశంలో 761 మందికి కొత్తగా కొవిడ్ వ్యాప్తి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితోపాటు ఒక్కరోజులోనే వైరస్ ధాటికి 12 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు మాత్రమే పెరగ్గా.. ఇప్పుడు మరణాలు కూడా పెరుగుతుండటంతో దేశంలో మరోసారి కరోనా భయాలు నెలకొంటున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 761 మందికి కరోనా సోకినట్లు కేంద్రం తెలిపింది. మరోవైపు.. 24 గంటల వ్యవధిలో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అయితే ఒక్కరోజే 838 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4334 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. చనిపోయిన 12 మందిలో కేరళకు చెందిన వారు ఐదుగురు కాగా.. కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో ఒకరు ఉన్నారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,385 కి ఎగబాకింది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్ రికవరీ రేటు 98.81 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇక ఇప్పటి వరకూ 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మరోవైపు దేశంలో కొవిడ్ వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలోని 12 రాష్ట్రాల్లో జేఎన్ 1 వేరియంట్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం తెలిపింది. జనవరి 3 వ తేదీ వరకూ దేశంలో జేఎన్ 1 కేసులు 541 కి పెరిగినట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa