ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే జగన్ మాట మీద ఉన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 04:36 PM

‘రా...కదలిరా’ సభలకు వస్తున్న అశేషజనవాహినిని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మాట తప్పను - మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డారని విమర్శించారు. హామీల అమలుకు రోడ్డెక్కిన అంగన్వాడీ సిబ్బందిపై ఎస్మా చట్టం ప్రయోగించడమేనా మాట తప్పకపోవడం అంటే?అని ప్రశ్నించారు.మాట తప్పకపోవడం అంటే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో తొలిస్థానంలో నిలపడమా? అని అన్నారు. మడమ తిప్పకపోవడమంటే, మద్యనిషేధం అని చెప్పి మహిళల తాళిబొట్లు తెంచడమా అని నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa