ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జులను సీఎం వైఎస్ జగన్ రెడ్డి మార్చడంతో రచ్చ రచ్చగా మారింది. మొత్తం రెండు జాబితాలను రిలీజ్ చేయగా.. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేకుండా పోయింది. ఈ జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. దీంతో.. అనకాపల్లిలో వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇంచార్జీగా మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళుతున్నందుకు బాధగా ఉందన్నారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన గుడివాడ అమర్నాథ్ ఎమోషనల్ అయ్యి.. ఏడ్చేశారు. ఇదంతా గతం.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు అమర్నాథ్ సేఫ్ జోన్లో ఉన్నారట. గుడివాడ అమర్నాథ్కు అధిష్టానం పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించినట్టు సమాచారం. పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేసిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు పెందుర్తి టికెట్ తమ నేతకే వస్తుందని గుడివాడ వర్గీయులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఇంతవరకూ అటు హైకమాండ్ నుంచి గానీ.. ఇటు అమర్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మాత్రం అమర్ సేఫ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa