ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 04:46 PM

విజయనగరం, బొబ్బిలిలో ఈనెల 10న జరగనున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బహిరంగ సభను ప్రతిఒక్కరూ జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్టీ నాయకులు బగ్గు రమణమూర్తి, గొంప కృష్ణలతో కలిసి ఆయన మాట్లాడుతూ..... రా కదలి రా.. పేరుతో ఈనెల 10న బొబ్బిలిలో నిర్వహిస్తున్న చంద్రబాబు సభకు పార్టీ నాయ కులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు విసిగిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, వెన్నె సన్యాసినాయుడు, టి.కిరణ్‌కుమార్‌, ముల్లు రమణ, సారేపాక సురేష్‌, తాడ్డి సన్యాసి నాయుడు, కెంగువ ధనుంజయ్‌, బలగం వెంకటరావు, వై.సత్యం, గవిడి నాగరాజు, మొగసాల రమేష్‌, ఆరతి సాహు, మహంతి అప్పలనాయుడు, వెంపడాపు లక్ష్ము నాయుడు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa