ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికలే లక్ష్యంగా పనిచెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 04:45 PM

విజయనగరం, బొబ్బిలిలో ఈనెల 10న జరుగనున్న టీడీపీ అధినేత చంద్రబాబు సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు పిలుపునిచ్చారు.  ఆయన మాట్లాడుతూ..... రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్‌, మహంతి శంకరరావు, కర్రోతు సత్యనారాయణ, పార్టీ నాయకులు పతివాడ అప్పలనారాయణ, పసుపులేటి గోపి, ఆకిరి ప్రసాదరావు, గేదెల రాజారావు, లెంక అప్పలనాయుడు, పాణిరాజు, అట్టాడ శ్రీధర్‌, అవనాపు సత్యనారాయణ, బొంతు వెంకటరమణ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa