ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు సభని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 04:43 PM

విజయనగరం, బొబ్బిలిలో ఈనెల 10న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నిర్వహించనున్న రా.. కదలిరా.. కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీ నాయన పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధినేతకు బొబ్బిలి నియోజకవర్గంలో ఘనస్వాగతం పలికేందుకు ప్రతిఒక్కరూ కదలిరావాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటనాయుడు, రాష్ట్ర వాణిజ్య విభాగాల కార్యదర్శి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ సింహాచలం, మండల నాయకులు యుగంధర్‌, శంకరరావు, చేపేన శశిభూషణరావు, కార్యకర్తలు, గ్రామ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.ఫ బాడంగి: స్థానిక తెంటు బంగ్లాలో నిర్వహించిన కార్యక్రమంలో బేబీనాయన మాట్లాడుతూ చంద్రబాబు సభను విజ యవంతం చేయాలని కోరారు. తెంటు లక్ష్మునాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు తెంటు రవిబాబు, కొల్లి అప్పలనాయుడు, పాలవలస గౌరు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa