ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు సభని విజయవంతం చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 04:52 PM

విజయనగరం, బొబ్బిలిలో ఈ నెల 10న చంద్రబాబు తలపెట్టిన ‘రా...కదిలిరా’ మహాసభకు అన్ని నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు హాజరుకావాలని ఎస్‌.కోట నియోజకవర్గ ఇన్‌చార్జి కోళ్ల లలితకుమారి కోరారు. లలితకుమారి నెల్లిమర్ల నియోజకవర్గ జనసమీకరణ ఇన్‌చార్జిగా నియమితులైనందున కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు సభను విజయవంతం చేయాలని, అందుకు జిల్లా నేతలంతా కష్టపడి పనిచేయాలని కోరారు. ఆమె సమక్షంలో నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో కేబీఏ రాంప్రసాద్‌, కె.విజయ్‌కుమార్‌, ఎ.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa