టీడీపీ టికెట్ కోసం ఆ పార్టీ నాయకులు నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డిలు దిగజారి తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులోని రెడ్లకల్యాణ మండపంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ టికెట్ను ఆశించే వీరిద్దరి అసత్యపు మాటలకు హద్దూ అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రొద్దుటూరులో వీళ్లకి ఉనికి ఉందని చెప్పుకోవడానికి, చంద్రబాబును ఆకర్షించేందుకు ఎంతటి అబద్దానైన్నా ఆడటానికి వెనకాడటం లేదన్నారు. ప్రవీణ్కుమార్రెడ్డి ఏ రోజూ ప్రజల కోసం తహసీల్దార్ ఆఫీసు, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లలేదని, ప్రజా సమస్యలపై పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు చేయలేదని చెప్పారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏది జరిగినా దానికి ఎమ్మెల్యే కారణమని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలు నమ్ముతారా లేదా అనేది ఆలోచన చేయకుండా బరి తెగించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసులు దాడులు నిర్వహిస్తే తన ప్రమేయంతోనే ప్రొద్దుటూరులో దాడులు చేస్తున్నారని టీడీపీ నాయకులిద్దరూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఇలా మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa