కోడికత్తి కేసులో శ్రీనుకు జరిగిన అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ రామకృష్ణ, టీడీపీ నేత వర్ల రామయ్య, ఫారూక్ షుబ్లీ, బాలకోటయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఎన్నికలలో గెలుపు కోసం జగన్ ఆడిన డ్రామాయే కోడి కత్తి దాడి అని పేర్కొన్నారు. అమాయకుడైన శ్రీనును అన్యాయంగా బలి చేశారన్నారు. ఐదేళ్లుగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే సమయం జగన్కు లేదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు ఎందుకు జగన్పై ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. దళిత బిడ్డ జీవితాన్ని జగనే నాశనం చేశాడన్నారు. ‘‘నా ఎస్సీ, ఎస్టీ అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే.. తన తప్పు తెలిసిపోతుందనే భయం. అమాయకుడైన యువకుడి జీవితాన్ని నాశనం చేసిన జగన్కు దళిత వర్గాలు బుద్ధి చెప్పాలి. జునుపల్లి శ్రీను పొడవలేదు.. గుచ్చాడంటే.. అతని ఆలోచన అర్థం చేసుకోవాలి. జగన్ విదేశాలకు వెళ్లే సమయం ఉంది. కోర్టుకు వచ్చి తీరిక లేదంటే ఏమనుకోవాలి? రాష్ట్ర గవర్నర్ను కూడా కలిసి జరిగిన విషయాలు వివరించాలి. శ్రీనుకు న్యాయం జరిగే విషయంలో ఎటువంటి పోరాటాలు చేసినా టీడీపీ మద్దతుగా ఉంటుంది’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa