2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆరో జాబితా విడుదలైంది. ఇప్పటి వరకూ ఐదు జాబితాలను ప్రకటించిన వైసీపీ.. శుక్రవారం ఆరో లిస్టు విడుదల చేసింది. తొలి ఐదు జాబితాల్లో 61 ఎమ్మెల్యేలు, 14 ఎంపీ స్థానాలకు ఇంఛార్జుల పేర్లను ప్రకటించింది వైసీపీ అధిష్ఠానం. శుక్రవారం మరో పదిమందితో ఆరో జాబితాను ప్రకటించింది. నాలుగు ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలకు శుక్రవారం ఇంఛార్జులను ప్రకటించింది.
గుంటూరు ఎంపీ: ఉమ్మారెడ్డి వెంకటరమణ
చిత్తూరు ఎంపీ : ఎం. రెడ్డెప్ప
రాజమండ్రి ఎంపీ: గూడూరి శ్రీనివాస్
నర్సాపురం ఎంపీ: ఉమాబాల
మార్కాపురం: అన్నా రాంబాబు
మైలవరం: తిరుపతి యాదవ్
గిద్దలూరు : కె. నాగార్జున రెడ్డి
ఎమ్మిగనూరు: బుట్టారేణుక
నెల్లూరు: ఎండీ ఖలీల్
జీడీ నెల్లూరు: కె. నారాయణస్వామి
మరోవైపు వైసీపీలో ఇంఛార్జుల మార్పుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఓటమి భయంతోనే వైఎస్ జగన్ అభ్యర్థులను మారుస్తున్నారంటూ విమర్శిస్తున్నాయి. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుందా అంటూ టీడీపీ, జనసేన నేతలు తీవ్రస్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. అలాగే స్థానాల మార్పుపై వైసీపీలోనూ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి ఈసారి ఛాన్స్ దక్కని నేతలు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే వంటి నేతలైతే ఏకంగా మీడియా ముందుకు వచ్చి మరీ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పనిలో పనిగా వేరే పార్టీల్లోకి చేరుతున్నారు.
అయితే విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా, స్వపక్షంలో అసంతృప్తులను బుజ్జగిస్తూనే ఇంఛార్జుల మార్పును కొనసాగిస్తున్నారు సీఎం జగన్. సర్వేలు, సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటూ నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. ఆ దిశగానే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa