విశాఖవాసులతో పాటూ ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్న్యూస్. విశాఖ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ (థాయ్లాండ్), కౌలాలంపూర్ (మలేషియా)లకు ఏప్రిల్ నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఎయిర్ ఏషియా వెబ్సైట్లో టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఏపీ విమాన ప్రయాణికుల సంఘం (ఏపీఏటీఏ) అధ్యక్షుడు కుమార్రాజా, ఉపాధ్యక్షులు ఒ.నరేష్ కుమార్, డీఎస్ వర్మ ఈ వివరాలు తెలిపారు. బ్యాంకాక్ విమానం ఏప్రిల్ 9న రాత్రి 11:50 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి.. 2 గంటల 45 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటుంది.
బ్యాంకాక్ నుంచి కాంబోడియా, చైనా, హాంగ్కాంగ్, ఇండోనేషియా, జపాన్, లావోస్, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలకు కూడా వెళ్లవచ్చునన్నారు కుమార్రాజా. కౌలాలంపూర్కు వెళ్లే విమానానికి సంబంధించి.. కాంబోడియా, చైనా, హాంకాంగ్, జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఆస్ట్రేలియా దేశాలకు కనెక్టింగ్ విమానాలు ఉంటాయని తెలిపారు. చెన్నై నుంచి విశాఖపట్నం మీదుగా పుదుచ్చేరికి క్రూయిజ్ నౌక ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ విమానం ప్రారంభ టికెట్ ధర రూ. 7,999.
కౌలాలంపూర్ విమానం ఏప్రిల్ 26న రాత్రి 7 గంటలకు అక్కడినుంచి బయలుదేరి.. 4 గంటల వ్యవధిలో విశాఖ చేరుకుంటుంది. ప్రారంభ టికెట్ ధర రూ. 4,999. ఈ రెండు విమానాల్లో ప్రయాణించేందుకు మే వరకు వీసా అవసరం లేదు. ఈ నెల 9 నుంచి విశాఖ-హైదరాబాద్ మధ్య ఎయిర్ ఇండియా మరో సర్వీసు నడపనుంది. మే లేదా జూన్లో నేరుగా దుబాయ్కు విమాన సర్వీసు ప్రారంభంకానుంది. మార్చి 31 నాటికి విమానాశ్రయం రన్వే నవీకరణ పనులు పూర్తవుతాయని నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయని విశాఖ ఎయిర్పోర్ట్ ఇంఛార్జ్ డైరెక్టర్ రాజారామన్ తెలిపారు. ఏప్రిల్ నుంచి డీజీ యాత్ర సదుపాయం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నారు. విమానాశ్రయంలో అదనంగా మరో 10 కౌంటర్లు ఏర్పాటుచేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa