తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీనే ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని బీజేపీ నేత పొంగులేటి సుధాకరరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటక కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు డి.కె. సురేష్ దక్షిణాది మరో దేశంగా కోరే డిమాండ్లు పెరుగుతుందని అన్నారని.. ఆయన అన్న మాటలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పన్నులు ఎక్కువ కడుతున్నా... దక్షిణాదికి తక్కువ నిధులు కేటాయించి, ఉత్తరాదికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నారని సురేష్ చెప్పటం తగదని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నీటి వాటాల సమస్యలను కూడా బీజేపీ ప్రభుత్వమే పరిష్కరిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ను, ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శ్రీని సీఎం జగన్ రెడ్డి కలిపేసి ప్రచారం ఎక్కువ.. పని తక్కువగా చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలను వినియోగించాలని సీఎం జగన్కు పొంగులేటి సుధాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa