ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. ఈ మేరకు పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కో ఆర్డినేటర్గా విజయసాయి రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు రీజనల్ కో ఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నియమితులయ్యారు. ఇటు కర్నూలు, నంద్యాల పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్గా పి రామసుబ్బారెడ్డి. కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్గా కె సురేష్ బాబు.. ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్.. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడుగా మల్లాది విష్ణును నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. మంత్రి గుడివాడ అమర్నాథ్కు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఆయనకు దాదాపుగా టికెట్ లేదా అనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa