ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు రకరకాల దుస్తుల్లో కనిపిస్తూ ఉంటారు. ఇక ఆయన విదేశాలకు వెళ్లినపుడు ప్రత్యేకమైన సూట్లు ధరిస్తారు. ఎప్పుడూ సూట్లు, శాలువాతో మోదీ కనిపిస్తారు. అయితే ప్రధాని మోదీ వేసుకున్న ఆ సూట్లను కొన్నిసార్లు
వేలం కూడా వేస్తూ ఉంటారు. ఆ వేలంలో అవి భారీ ధరకు అమ్ముడుపోవడం కూడా మనం చూశాం. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ధరించే దుస్తుల విషయంలో రాహుల్ గాంధీ తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని సంపాదించే జీతానికి.. ఆయన వేసుకునే దుస్తులకు పెట్టే ఖర్చుకు అసలు సంబంధం లేదని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ జీతం నెలకు రూ.1.6 లక్షలు అయితే.. ఆయన నెలకు ధరించే సూట్ల ధరనే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంపాదించేది రూ.1.6 లక్షలు అయితే రూ.3 కోట్ల సూట్ ఎలా కొంటున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
"మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూస్తే ఉదయం ఒక సూట్ను ధరించి ఉంటారు. ఆయన ధరించే ఒక్కో సూట్ ధర రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. మళ్లీ సాయంత్రం వరకు మరో సూట్లో, శాలువాతో కనిపిస్తారు. ఇక సూట్, శాలువా కలిపి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. జీతానికి మించి బట్టలకే ప్రధాని ఖర్చు చేస్తున్నారు. అన్ని డబ్బులు ప్రధాని మోదీకి ఎక్కడి నుంచి వస్తున్నాయి" అని రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన రాహుల్ గాంధీ ఢిల్లీకి పయనం అయ్యారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ ఢిల్లీకి వెళ్లారు. ఇక మణిపూర్లో ప్రారంభం అయిన ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర 14 రాష్ట్రాల మీదుగా 6200 కిలోమీటర్లు సాగి ముంబైలో ముగియనుంది. ఈ నెల 16 వ తేదీన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తర్ప్రదేశ్లోకి ప్రవేశించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa