ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరక సీఎం జగన్కి ఆయన లేఖ రాశారు. ‘‘ ఆర్యా.. నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిలా పార్టీ అధ్యక్ష పదవికి, వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అంటూ పార్టీకి రాజీనామా లేఖలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రాజ్యసభ ఎంపీ పదవి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ‘‘ నేను, నా వ్యక్తిగత కారణాల వలన నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను’’ అంటూ ఎంపీ పదవి రాజీనామా చేసిన లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుండగా వేమిరెడ్డి భార్య ప్రశాంతి ప్రస్తుతం ఆమె టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa