బీజేపీపై తొలి నుంచి తన అభిమానాన్ని బాహాటంగా ప్రకటించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ పార్టీ నాయకత్వానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో ఏర్పాటు చేసిన జనసైనికుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో తనకు తెలిసిన తొలి నేత ప్రధాని మోదీనే అన్నారు. ఆయన్ని చూసి తాను ఎన్నో నేర్చుకున్నానని.. ప్రజలకు మంచి చేసేతత్వం ఆయన నుంచి అందిపుచ్చుకున్నదేనని స్పష్టం చేశారు. తనకిచ్చిన బాధ్యత నెరవేర్చడానికి, సమస్య పరిష్కరించడానికి అవసరమైతే శిరస్సు వంచుతానని పేర్కొన్నారు. మతం అంటే ఆధిపత్యం చెలాయించడం కాదని.. అందరినీ సమన్వయపరచడం అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa