ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన, భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో రెండున్నర వేల చొప్పున పింఛన్ అందిస్తుండగా.. ఆ మొత్తాన్ని ఐదువేలకు పెంచుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జీవో విడుదల చేశారు. అయితే ఇటీవల గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పింఛన్ మొత్తాన్ని పెంచుతామని, వచ్చే నెల నుంచి ఇది అమలు చేస్తామంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన మాట మేరకు ఏపీ ప్రభుత్వం వారికి పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పింఛన్ల పెంపు విషయాన్ని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి, భూములు లేక 17 వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని సీఎం జగన్కు వివరించారు. వీరికి అందించే పింఛన్ మొత్తాన్ని 2,500 నుంచి ఐదు వేలకు పెంచాలంటూ సీఎం జగన్ను అభ్యర్థించారు. మేకతోటి సుచరిత అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన జగన్.. వచ్చే నెల నుంచి పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.
గతంలో సాధారణ పింఛన్లు వేయి రూపాయలుగా ఉన్న సమయంలో .. అమరావతి ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన వారికి రూ.2.500 పింఛనుగా ఇచ్చేవారని జగన్ గుర్తు చేశారు. వైసీపీ హయాంలో వృద్ధాప్య, వితంతు పింఛన్లను మూడువేలకు పెంచామన్న వైఎస్ జగన్.. రాజధాని ప్రాంతంలో ఉపాధికోల్పోయిన వారికి కూడా పింఛన్ మొత్తాన్ని పెంచుతామని సభావేదికగా ప్రకటించారు. హామీ ఇచ్చినట్లుగానే పింఛన్ మొత్తాన్ని రెండున్నర వేల నుంచి ఐదువేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa