టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్యాలెస్లు వెలిగిపోతుంటే.. పేదల గూళ్ళు కూలిపోతున్నాయన్నారు. రుషికొండకు గుండుకొట్టి వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేశారన్నారు. వైసీపీ నేతల ధన దాహానికి గృహప్రవేశానికి ముందే పక్కా ఇళ్లు కూలిపోతున్నాయని మండిపడ్డారు. కేంద్ర నిధులతో పాటు లబ్ధిదారుడి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. తామే కట్టించి ఇస్తామని ఒక్కపైసా ఖర్చు పెట్టకపోగా.. నిర్మాణం పేరుతో దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం పనులతో లబ్ధిదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. దోచుకో.. దాచుకో.. విధానంతో తాడేపల్లి ఖజానా నింపుకున్న వైయస్ జగన్ ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టారని దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa