అరకులోయ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పేరు బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి జాబితాను విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి గీత పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. గ్రూప్-1 అధికారిగా సేవలందించారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉండడంతో 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అరకులోయ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2018లో వైసీపీ అధిష్ఠానంతో విభేదాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి జనజాగృతి పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. 2019లో బీజేపీలో విలీనం చేశారు. గత ఏడాది ఆగస్టులో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పొత్తులో భాగంగా అరకులోయ ఎంపీ సీటును బీజేపీకి కేటాయించడంతో కొత్తపల్లి గీత అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa