ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రవర్తనతో విసుగు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పాలడుగు భానుప్రకాష్ మంగళవారం ఆ పార్టీ కి రాజీనామా చేశారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. భానుప్రకాష్ తోపాటు టీడీపీ నాయకులు కమ్మ రాజారావు, కండేపు బాబూరావు, పిట్టా రవి వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కూర్మారావుపేటలో 30 మంది మహిళలు, గౌడపేటలో 25 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు మంగళవారం వైయస్ఆర్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైయస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa