రంపచోడవరం రిజర్వుడ్ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా గ్రూపు రాజకీయ కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ అభ్యర్థిత్వం విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం చుట్టూనే ఇక్కడ వివాదం సాగుతోంది. అధిష్ఠానం నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒక వర్గం అభ్యర్థి మిరియాల శిరీషను బలపరిచి నిలుస్తుండగా ఇందుకు వ్యతిరేకంగా మరికొన్ని గ్రూపులు నిలిచాయి. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్, వంతల రాజేశ్వరి తమకు అవకాశాన్ని ఇచ్చి తీరాలని కోరిన విషయం తెలిసిందే! అయితే మిరియాల శిరీషను అభ్యర్థిగా ఖరారు చేశాక రాజేశ్వరి, శీతంశెట్టి వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చిన్నం బాబూరమేష్ టికెట్ ఆశిస్తూనే తటస్థంగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల పరిణామాలు క్రమేపీ కుమ్ములాటలుగా మారిపోతున్నాయి. రంపచోడవరం అభ్యర్థిత్వం విషయంలో అధిష్ఠానం పునరాలోచించాలని కోరుతూనే, వంతలకు టికెట్ ఇవ్వకుంటే రాజీనామాలు చేస్తామని ఒక వర్గం అన్ని మండలాల నుంచి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శిరీష వర్గం కూడా తీవ్రంగానే స్పందించింది. గతంలో అధిష్ఠాన నిర్ణయాలను గౌరవించిన సందర్భాలను గుర్తు చేస్తూ ఆరోపణలకు దిగింది. సామాజిక మాధ్యమాలను ఈ వర్గాలు వేదిక చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులను గమనిస్తున్న సీనియర్లు, క్యాడర్ విజయావకాశాలపై ఆందోళన చెందుతున్నాయి. కేవలం పార్టీలో చోటు చేసుకున్న వర్గ పోరు, ఆధిపత్య పోరు, సమన్వయ లోపాలు ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా మారతాయన్న ఆందోళన సర్వత్రావ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి తెలిసీ కూడా ఉమ్మడి జిల్లాలోని కీలక నేతలు సైతం పరిస్థితిని సరిచేయకపోవడం పట్ల కూడా క్యాడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa