రాష్ట్రం నాశనం అయిపోతోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్కల్యాణ్. పవన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి, ప్రజలను గెలిపించడానికి, న్యాయం చేయడానికి బీజేపీ, టీడీపీ, జనసేన ఒక జట్టుగా వచ్చాం. రాజమహేంద్రవరం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీచేస్తున్నారు. జనసేన నుంచి రాజానగరం, నిడదవోలు నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీచేస్తున్నారు. టీడీపీ 5 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తోంది. అందులో ఒకటి బీజేపీకి ఇచ్చాం. అందరినీ గెలిపించాలి’ అని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa