ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు భాషకే వన్నె తెచ్చిన చిరస్మరణీయుడు శాంతిస్వరూప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 02:55 PM

తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు  అన్నారు. శాంతిస్వరూప్ వార్తలు చదివితే చదవినట్లుగా కాక.. చెప్పినట్లుగా ఉండేవన్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు తెలుగు వార్తలను చదివి తెలుగు భాషకే వన్నె తెచ్చిన చిరస్మరణీయుడు శాంతిస్వరూప్ అని కొనియాడారు. టెలీప్రాంప్టర్ లేని రోజుల్లో కేవలం స్క్రిప్టు పేపర్ల ఆధారంగా వార్తలు చదివిన శాంతిస్వరూప్ నేటి యువతకు ఎంతో ఆదర్మనీయులన్నారు. శాంతి స్వరూప్ వార్తలు చదివితే అవి చదివినట్లు కాక చెబుతున్నట్లుగా ఉండేవని.. అదీ న్యూస్ రంగంలో శాంతిస్వరూప్ ముద్ర అని చెప్పుకొచ్చారు. అలాంటి తెలుగుజాతి ముద్దుబిడ్డ శాంతి స్వరూప్ ఆత్మకు శాంతికలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్ధిస్తునానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa