నేడు ఐపీఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అయితే 166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్రైజర్స్ నిర్ణీత 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రామ్ 50 పరుగులు, అభిషేక్ శర్మ 37 పరుగులు, ట్రావిస్ హెడ్ 37 పరుగులు, షాబాజ్ అహ్మద్ 18, హెన్రిచ్ క్లాసెన్ 10, నితీష్ రెడ్డి 14 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa