ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సమస్యలు తెలిసిన ఏకైక నాయకుడు జగన్ మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 02:52 PM

ప్రొద్దుటూరు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి రాచ‌మ‌ల్లు శివప్ర‌సాద‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కొత్తపల్లి పంచాయతీలోని కానపల్లిలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి కానపల్లి గ్రామ ప్రజల నుండి అద్భుతమైన స్పందన, ఆదరణ, ప్రేమాభిమానాలు ఆయనకు లభించాయి.  గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించడం, ఈ ఊరికి, ఈ గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరించడం, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తాను సహాయపడిన విధానాన్ని వివరించి మే 13న జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను మరొక్కసారి ఆశీర్వదించి, ఎంపీ అభ్యర్థిగా వైయ‌స్ అవినాష్ రెడ్డి గారికి ఓటు వేయవలసిందిగా విజ్ఞ‌ప్తి చేశారు.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa