సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నిర్వహిస్తున్న బస్సు యాత్రకు వస్తున్న ప్రజా స్పందన టీడీపీ–జనసేన–బీజేపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి.. నిజాయితీతో, నిబద్ధతతో సుపరిపాలన అందించే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి, పేదంటి భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుతూ.. రాష్ట్రం రూపురేఖలు మార్చిన సీఎం వైఎస్ జగన్కు బస్సు యాత్రలో జనం అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండైనా అర్ధరాత్రయినా ఊరూరా అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. వైయస్ఆర్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో సీఎం వైయస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు జనం పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. సిద్ధం సభలను మరిపించేలా బస్సు యాత్రకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పడుతుండటంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం కన్పిస్తోందని ఇటు రాజకీయ పరిశీలకులు, అటు కూటమి నేతలు గుర్తించారు. మాటపై నిలబడే నాయకుని నాయకత్వంపై పని చేసేందుకు కూటమి నేతలు పోటీపోటీగా వైఎస్సార్సీపీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa