ఐపీఎల్ 2024లో భాగంగా నేడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్ల మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అయితే 288 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆర్సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ 42, ఫాఫ్ డు ప్లెసిస్ 62, విల్ జాక్స్ 7, రజత్ పాటిదార్ 9, దినేష్ కార్తీక్ 83, మహిపాల్ లోమ్రోర్ 19, విజయ్కుమార్ వైశక్న్1, అనుజ్ రావత్ 25 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa