సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఐదుగురు అనుమానితులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన పోలీసులకు అనుమానితుల్లో ఓ యువకుడు సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తునకు 8 బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడు రాయి విసిరినట్లుగా పోలీసులు గుర్తించారు. దాడి చేయటం వెనుక ఉన్న కారణాలు ఏంటో పోలీసులు ఇప్పటికే తెలుసుకున్నారని సమాచారం. జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో పబ్లిక్లో ఉన్న వ్యక్తులు తీసిన వీడియోలను పరిశీలించడం ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడే కారణమని పోలీసులు గుర్తించారని తెలిసింది. సతీషే.. జగన్పై రాయి విసిరినట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa