చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదని వైయస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. సచివాలయాలలో భర్తీ చేసిన ఉద్యోగాలలో అత్యధిక శాతం మంది మహిళలే ఉన్నారని ఆమె చెప్పారు. బుధవారం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ..... మహిళలను మోసం చేసే మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారు.రాష్ర్టంలో ఏ మహిళా కూడా చంద్రబాబును నమ్మే పరిస్ధితి లేదు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు చేసిన మోసం వల్ల డ్వాక్రా మహిళలు రోడ్డున పడ్డారు. మహిళలకు డ్వాక్రా రుణమాఫీ జగన్ గారు చేసి చూపించారు.అందుకే మహిళలు వాళ్ల కాళ్ళ పై నిలబడి మహిళా సాధికారిత సాధించారు. వైయస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక మహిళలకి స్వర్ణ యుగం ప్రారంభమైంది. ఆసరా,చేయూత వంటి పథకాలతో మహిళలు అభివృద్ధి చెందుతున్నారు.చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా,మోసాలతో ఉంటుందో మహిళలకి తెలుసు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ భారం ఉండేది ఇప్పుడు వడ్డీ రాయితీతో డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నంగనాచిలాగా మహిళలు ఎదుట మద్యం గురించి మాట్లాడుతున్నారు.బెల్ట్ షాపులు పెట్టింది నువ్వు కాదా.మద్యాన్ని ఊరూరా పారించింది నీవు కాదా. కేంద్రం వల్ల పెట్రోల్,నిత్యావసర వస్తువులు,సరుకుల రేట్లు పెరుగుతున్నాయి.ఇది బహిరంగ రహస్యం.అయినా బిజేపితో పొత్తుతో ఉన్నారు కాబట్టి బిజేపిని నిలదీసే దమ్ములేక జగన్ గారిపై చంద్రబాబు బురద చల్లుతున్నారు. బీజేపీని ఎందుకు అడగం లేదు. రాజకీయపదవులలోనే కాదు,ప్రభుత్వ వర్క్స్ లలో సైతం 50%మహిళలకి రిజర్వేషన్ అమలు చేసాము. చంద్రబాబూ మీకు దమ్ముంటే అమలు చేయగలరా. చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదు..సచివాలయాలలో భర్తీ చేసిన ఉద్యోగాలలో అత్యధిక శాతం మంది మహిళలే ఉన్నారు. రాష్టంలో గంజాయి ఉందని అబద్దాలు చంద్రబాబు చెబుతున్నాడు. విశాఖలో పట్టుబడిన 25వేల టన్నుల డ్రగ్స్ రవాణా వెనకాల ఎవరు ఉన్నారో అందరికి తెలుసు. గంజాయి సాగు మేము నాశనం చేశాం.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. మీ హయాంలో గంజాయి లేదా...మహిళలు మిస్సింగ్ గురించి సైతం అబద్దాలు చెబుతున్నారు.మహిళలకు భధ్రత కల్పించింది జగన్ . చంద్రబాబు వంద అబద్దాలు చెబితే అందులో ఒకటేనా నిజం ఉండాలి కదా అని తెలియజేసారు.