బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను అమలు చేయడం వల్ల పేద పిల్లలకు అవకాశాలు పెరగుతున్నాయని కృష్ణయ్య చెప్పారు. కలెక్టర్, డాక్టర్, ఇంజినీర్లుగా తయారవడమే కాకుండా విదేశాలకు పెద్దఎత్తున పేద వర్గాల పిల్లలు వెళ్తున్నారని వివరించారు. విదేశీ విద్య కోసం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సాయం కూడా అందుతోందన్నారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల ప్రజలకు కేవలం సుత్తి, పార, ఇస్త్రీ పెట్టె వంటి పనిముట్లు ఇచ్చేందుకు పరిమితమైతే.. సీఎం వైయస్ జగన్ రాష్ట్ర బడ్జెట్లోను, అధికారంలోను ప్రత్యేక వాటా ఇస్తున్నారని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa