ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 16 నెలలు జైల్లో ఉన్న ఆర్ధికనేరస్తుడు సీఎంగా ఉన్నారన్నారు. జగన్ ఆర్థిక నేరస్తుడని ఆయన అఫిడవిట్ చెప్తుందన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ జగన్ బాటలో నడుస్తున్నారని ఆరోపించారు. మళ్ళీ జగన్ గెలుస్తే ఏపీలో శాంతి భద్రతలు, ప్రజల ఆస్తులు ఉండవని వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి ఓట్లు వేయాలని కోరారు. ఏపీలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయా లేదని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ఏపీలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa