ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ వివిధ దినపత్రికల్లో ఇచ్చిన ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. వైయస్ఆర్ సీపీ గ్రీవెన్స్ సైల్ ఛైర్మన్ నారాయణమూర్తి, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదుతో పాటు ఆధారాలను అందచేశారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు సమాచారం అందిస్తున్న విషయంపై వైయస్ఆర్ సీపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. దానిపై ఈసీ సీఐడీ విచారణకు ఆదేశించింది. అది దర్యాప్తు దశలో ఉండగానే తిరిగి నేడు వార్తాపత్రికలలో పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చారని, వాటికి సంబంధించి కనీసం ఈసీ అనుమతులు ఉన్నట్లు ఆ ప్రకటనలలో ఎక్కడా పేర్కొనలేదని వైయస్ఆర్ సీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa