ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 08:06 PM

ఆంధ్రప్రదేశ్‌‌కు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.. మరో నాలుగు రోజుల పాటూ వర్షాలు పడతాయంటోంది. ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయంటున్నారు. రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరువానలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


 రాబోయే నాలుగు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయంటున్నారు. మరోవైపు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం,కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు-గొర్రె కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం మంచిది కాదంటున్నారు.


 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa