సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్లో అక్రమ సొమ్ము భారీగా బయటపడుతున్నది. శుక్రవారం ఒక వాణిజ్య వాహనంలో రూ.7 కోట్లను తరలిస్తుండగా తూర్పుగోదావరి పోలీసులు పట్టుకున్నారు.భారీగా సొమ్మును తరలిస్తున్న ఈ వాహనాన్ని నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఒక లారీ ఢీకొనడంతో బోల్తాపడింది. దీంతో ఆ వాహనంలో ఉన్న ఏడు అట్టపెట్టెల్లోని నగదును వేరే ప్రదేశానికి తరలించడానికి ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని అందులోని నగదును లెక్కించగా, సుమారు ఏడు కోట్ల రూపాయలున్నట్టు తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa