ఇటీవల జరిగిన శాసనసభా ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం జనసేన. టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీ చేశారు. ఇదే పేరునగల ఇతర జిల్లాలకు చెందిన మరో ఇద్దరు అభ్యర్థులు అసెంబ్లీకి, ఒక అభ్యర్థి లోక్సభకు పోటీ చేశారు. కూటమి అభ్యర్థి బత్తులకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజుగ్లాసును పోలిన గుర్తులే మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు కేటాయించడం, ఈ ముగ్గురు అభ్యర్థుల పేర్లు ఈవీఎంలలో వరుస క్రమంలో ఉండడంతో కొంత మంది ఓటర్లు అయోమయానికి గురైనట్లు తెలుస్తోంది. ఓటర్లు చైతన్యవంతులై ఓటుహక్కు వినియోగించుకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రత్యర్థులు వేసే ఇటువంటి ఎత్తులు చిత్తుకావడం ఖాయమని కూటమి వారు అంటున్నారు. జూన్ నాల్గవ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలు తమ అభ్యర్థికే విజయం చేకూరు తుందన్న గట్టి విశ్వాసంతో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ముగిసి ఓటరు తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఓటింగ్ జరిగిన తీరు చూస్తే ఓటర్లు స్పష్టతతో తీర్పు ఇచ్చారని తెలుస్తోంది. ఓటింగ్ లో జిల్లాలోనే రాజానగరం నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది. చాలాగ్రామాలలో ఓటర్లు ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి క్యూలైన్లులో వేచి ఉండడం, పోలింగ్సమయం సాయంత్రం 6 గంటలు దాటినా బాగా పొద్దుపోయే వరకూ ఓపికతో వేచిఉండి ఓట్లు వేశారు. నియోజకవర్గంలో 2,16.491 మంది ఓటర్లుకుగాను 87.53 శాతం అనగా1,89,505 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాము చాలా ఎన్నికలలో పనిచేశామని ఈవిధంగా ఓటర్లు ఓట్లు వేయడం అరుదుగా చెప్పవచ్చునని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇక గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందునుంచే రాత్రింబవళ్లు ప్రజలను కలుసుకొని వారి ఆశీర్వాదం అందుకు నేందుకు ప్రయత్నించిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఓట్లు లెక్కింపు కోసం ఎదురు చూస్తున్నారు. నాయకులు,కార్యకర్తలతో గెలుపు అవకాశాలపై చర్చలు సాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa