ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 02:01 PM

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మావటూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సంపత్‌ కిష్టప్పపై అదే ఊరికి చెందిన వైసీపీ వర్గీయులు గురువారం దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సంపత్‌కిష్టప్ప ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారని కక్షతోనే  మావటూరు వైసీపీ మద్దతు సర్పంచ్‌ నాగరాజు తమ్ముడు జీజే శేఖర్‌, నాయకులు మోహన్‌, చాకలి మారుతి, సూర్యనారాయణ  గురువారం పనినిమిత్తం కర్ణాటకలోని దొమ్మి తిమర్రి గ్రామానికి వెళ్లిన సంపత్‌కిష్టప్పను మాటేసి కర్రలు,రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు అని అన్నారు. తీవ్ర గాయాలతో పడిపోయిన సంపత్‌కిష్టప్పను స్థానికులు పావగడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa