పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తామని సీపీఎం అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యుడు అబ్బవరం రామాంజులు అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆదివారం అనంతపురం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏవీ రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, సీపీయం నాయకులు మాధవయ్య మాట్లాడుతూ ఎగువ గొట్టివీడుకు చెందిన నాగరాజు ఆర్థిక సహకారంతో 100 మంది రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశామని తెలిపారు. నిజాయితీకి మారుపేరుగా ఉదహరించే మహానాయకుల్లో సుందరయ్య ఒకరన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఈయూ నాయకులు ఆదిలక్ష్మి, సులోచన, అంజి, హర్ష, చెన్నయ్య, అంజి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa