జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలలకు కనీస వేతనం రూ. 300 వచ్చేల పని ఎలా చేయాలో అవగాహన కల్పించాలని జిల్లా డ్వామా పీడి బి. అర్జున రావు అధికారులకు, సిబ్బందికి సూచించారు. మంగళవారం ఎర్రగొండపాలెం మండలంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఫారం పండ్, హార్టికల్చర్ పంటలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఏపిఓ లు ఎమ్. శైలజ, నాగేశ్వరరావు, ఈసీ లక్ష్మ నాయక్, సిబ్బంది ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa