ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓట్ల లెక్కింపు అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 07:29 PM

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ సూచించారు. అమలాపురం పరిధిలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాలలో స్ర్టాంగ్‌ రూములను ఏర్పాటుచేయగా ఆయన పరిశీలించారు. స్ర్టాంగ్‌ రూముల వద్ద ఏర్పాటుచేసిన మూడంచెల భద్రతను, సీసీ కెమెరాల నిఘాను, ఓట్ల లెక్కింపు వద్ద ఏర్పాటుచేసిన ఫెన్సింగ్‌లను తనిఖీచేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదనపు ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌బాషా పర్యవేక్షణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించిన మామిడికుదురు దీప్తి ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులకు ఎస్పీ జారీచేసిన ప్రశంసాపత్రాలు, గౌరవ వేతనం రూ.500 చొప్పున కొత్తపేట డీఎస్పీ కె.వెంకటరమణ, పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్‌కుమార్‌, ఎస్‌ఐ పీవీఎస్‌ఎస్‌ఎన్‌ సురేష్‌లు అందజేసి అభినందించారు. అయినవిల్లి మండలంలో బందోబస్తు నిర్వహించిన స్థానిక ఎస్‌ఎన్‌వీఆర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులకు డీఎస్పీ కేవీ రమణ, ఎస్‌ఐ బి.రాజేష్‌లు ప్రశంసాపత్రాలు, నగదు అందజేశారు. అంబాజీపేట ఎస్‌ఐ కె.చిరంజీవి చేతులమీదుగా బందోబస్తు నిర్వహించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రామచంద్రపురం వీఎస్‌ఎం కళాశాలకు చెందిన ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులకు డీఎస్పీ బి.రామకృష్ణ, సీఐ పి.దొరరాజు, ఎస్‌ఐ కె.సురేష్‌బాబులు ప్రశంసా పత్రాలు అందించారు. అమలాపురం డీఎస్పీ ఎం.మహేశ్వరరావు ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ పి.వీరబాబు, ఎస్‌ఐ జి.హరీష్‌కుమార్‌ల ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి కౌంటింగ్‌ రోజున తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అదేవిధంగా మండపేట ఎస్‌ఐలు అఖిల్‌జమా, కె.శ్రీధర్‌కుమార్‌ల ఆధ్వర్యంలో కౌంటింగ్‌లో అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు పాటించాల్సిన విధి విధానాలను వివరించారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని కోరారు. జూన్‌ 10 వరకు బాణసంచా విక్రయాలు, లూజు పెట్రోల్‌ అమ్మకాలు నిషేధించినట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa