ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో విషాదం.. ప్రాణం తీసిన కలుషిత నీరు.. వందమందికి అస్వస్థత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 07:37 PM

విజయవాడలోని మొగల్రాజపురంలో నగరపాలకసంస్థ సరఫరా చేసిన నీరు తాగి ఓ వ్యక్తి చనిపోవడం కలకలం రేపుతోంది. మొగల్రాజపురంలో వల్లూరు దుర్గారావు అనే వ్యక్తి కలుషితమైన నీళ్లు తాగి.. అస్వస్థతకు గురై సోమవారం చనిపోయారు. మరో వందమంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో అధికారులు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. 30 పడకలతో స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ సరఫరా చేసిన నీటిని తాగవద్దని సూచిస్తున్నారు. అలాగే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


ఇక చనిపోయిన వ్యక్తికి నాలుగుసార్లు విరేచనాలు అయ్యాయని.. ఆయన ఫిట్స్ రావటంతో చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. మొగల్రాజపురంలో నీటిని పరీక్షకు పంపిన అధికారులు.. రిపోర్టు వచ్చిన తర్వాతే అసలు నిజం తెలుస్తుందని చెప్పారు. అయితే మొగల్రాజపురం వాసులు మాత్రం అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. కలుషితమైన నీళ్లు వస్తున్నాయని చెప్పినా కూడా.. అధికారులు పట్టించుకోలేదంటున్నారు. ఆ నీళ్లు తాగే విరేచనాలతో దుర్గారావు చనిపోయాడని చెప్తున్నారు.


మరోవైపు విజయవాడలోని 64 డివిజన్లలో సుమారుగా 12.5 లక్షలమంది నివశిస్తున్నారు. సుమారుగా రెండు లక్షల కుటుంబాల వరకూ ఉండగా.. వీరికి రోజూ 38 ఎంజీడీల నీటిని విజయవాడ నగరపాలకసంస్థ సరఫరా చేస్తోంది. అయితే లీకేజీల కారణంగా నీళ్లు కలుషితం అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే పైపులైన్ల నిర్వహణ సరిగా ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు కృష్ణానదిలో కలుస్తున్నాయని.. అధికారులు కేవలం క్లోరినేషన్ చేసి ఈ నీటిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రాజధాని ప్రాంతంలో కలుషిత తాగునీరు తాగి ఓ వ్యక్తి చనిపోవటం చర్చనీయాంశమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa