ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. డెమో రైళ్లు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 08:50 PM

ఏపీలో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. డెమో రైళ్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. రైల్వే ట్రాక్‌, ఇతర నిర్వహణ పనులు కారణంగా పది రోజులుగా డెమో రైళ్లు రద్దు చేశారు.. ఆ పనులు పూర్తికావడంతో ఈ రైళ్లు మళ్లీ పట్టాలెక్కాయి. రాజమహేంద్రవరం, నిడదవోలు, విజయవాడ, గుంటూరు నుంచి నడిచే అన్ని రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లు గతంలో షెడ్యూల్‌ ప్రకారం నడుస్తాయని అధికారులు తెలిపారు. అటు నరసాపురం, భీమవరం నుంచి నడిచే డెమో రైళ్లు కూడా ప్రారంభమయ్యాయి.. షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయి.‌


మరోవైపు గుంటూరు వెళ్లే పాస్ట్‌ ప్యాసింజర్‌ మాత్రం ప్రారంభంకాలేదు. ఈ నెల 31 నుంచి ఈ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కనున్నట్లు తెలిపారు. నరసాపురం నుంచి ఉదయం 9.45కి విజయవాడ, అలాగే మధ్యాహ్నం 2.45కి గుంటూరు, మధ్యాహ్నం 3.05కి విజయవాడ, రాత్రి 8.10కి నిడదవోలు, రాత్రి 11.10కి భీమవరం వెళ్లే డెమా రైళ్లు కూడా షెడ్యూల్ మేరకు నడవనున్నాయి. ఈ డెమో రైళ్లు పది రోజులుగా రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ రైళ్లన్ని ఒకేసారి రద్దు కావడంతో రైల్వే స్టేషన్‌లు వెలవెలబోయాయి. కొందరు ప్రయాణికులు గుంటూరు పాస్ట్‌ ప్యాసింజర్‌ రైలు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఈ రైలు రద్దు చేయడంతో ఉదయం సమయంలో గుంటూరు, విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa