అయిదేళ్ల అరాచకంపై జగన్ చెంప చెల్లుమనిపించేలా ప్రజా తీర్పు ఉందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. వైసీపీ ఓటమికి కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం జగన్ రెడ్డేనని అన్నారు. సొంత జిల్లాలోనే వైసీపీ కుదేలవడం ప్రజల తిరస్కారానికి తార్కాణమని చెబుతున్నారు. సీఎం జగన్ రెడ్డి ఓటమి ఒప్పుకోలు ప్రకటనలోనూ నిజాయతీ లేదన్నారు. అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లంటూ ఇంకా దొంగనాటకాలు ఆడుతున్నాడని ప్రత్తిపాటి విమర్శించారు. ప్రజలకు ఎందుకు నేలకేసి కొట్టారో అర్థం కానంత అమాయకుడా జగన్ అని ప్రశ్నించారు. చెడుపై ఎప్పటికీ మంచిదే విజయమని ప్రజలు మరోసారి నిరూపించారన్నారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జట్టు రాష్ట్రంలో సూపర్ హిట్ అని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న మార్పును అందించడమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa