దర్శిలోనే నివాసం ఉండి ప్రజలకు సేవలందిస్తానని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన విజయం కోసం అహర్నిశలూ కృషిచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 40 రోజుల సమయంలోనే సొంత బిడ్డలా ఆదరించిన ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తానని, ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa